నిన్నటి వరకు ఉప్పు నిప్పు లా ఉన్న సెల్వం , పళని స్వామి వర్గాలు ఎప్పు ఒకటి అయ్యే సూచనలు కనిపిస్తున్న విషయం తెలిసిందే ఐతే తిరుగుబావుటా ఎగరేసి అమ్మ నమ్మిన కొడుకు పన్నీర్ సెల్వం కేంద్రం ప్రోద్బలం తో సమయం చూసి దెబ్బ కొడుతున్న సంగతి కూడాతెలిసిందే ,సరిగ్గా లంచమివ్వజూపిన కేసులో చూసి మల్లి స్వరం పెంచిన సెల్వమ్, నిన్నటి వరకు పెట్టిన రెండు డిమాండ్లు పార్టీ కార్యదర్శి ఇవ్వాలని ఒకటి , సీఎం పదవి, శశికళ వర్గానికి ఉద్వాసన చెప్పాలనే అంటూ వచ్చారు కానీ తాజా గా ప్రెసిడియుమ్ చైర్మన్ మధుసూదనన్ ద్వారా ఇంకో బలమైన డిమాండ్ ని తీసుకొచ్చారు , పార్టీలోకాని మరెక్కడా కానీ శశికళ ఫోటో కనిపిస్తే కుదరదని అంటున్నారు , అమ్మ పార్టీ ని రక్షించాలంటే శశికళ ఛాయ కూడా ఉండకూడదు అని అయన వాదన, అమ్మ మరణం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని పట్టు పడుతూనే మరో సారి ఈ విషయాన్నీ ప్రస్తావించారు .శశికళ లేకపోతె తానూ తన వర్గం పార్టీలో చేరేందుకు సిద్ధమని అంటున్నారు సెల్వమ్ ….
]]>